Posts

Showing posts with the label Tamilnadu

మహానది చిత్రంలోని “శ్రీ రంగ రంగనాథుని" పాటలో చూపించిన ఆలయం ఎక్కడిది?

Image
కమలహాసన్ నటించిన మహానది చిత్రంలో “శ్రీ రంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే...” అనే పాట మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఆ పాటలో చూపించిన పురాతన దేవాలయం ఎక్కడిది అనే కుతూహలం మీలో ఎంతమందికి కలిగింది?  నేను మహానది సినిమాను 1994 లో మా వూరైన అమలాపురంలో చూడడం జరిగింది. వృత్తి రీత్యా నేను 1999 లో తమిళనాడుకు రావడం జరిగింది. కానీ ఈ ఆలయం ఎక్కడ వున్నది అనేది ఒక సంవత్సరం క్రితమే తెలిసింది. అంటే దాదాపు పాతిక సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే అనుకోకుండా ఈ ఆలయాన్ని ఈ మధ్యనే దర్శించడం కూడా జరిగింది.  ఈ పాటలో శ్రీ రంగనాథుని గురించి వర్ణిస్తూ ఉంటే, మనం ఈ ఆలయం విష్ణువుకి సంబంధించినది అని అనుకుంటే చాలా పొరపాటే. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మయిలాడుదురై-కుంభకోణం నడుమున ఉన్న “త్రిభువనం” అనే ఊరిలో ఉంది. ఇది మహా శివునికి సంబంధించిన ఆలయం!! ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* త్రిభువనం ఆలయంలో ప్రధాన దైవం- శ్రీ కంపాహరేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం, ఒక రాజు పొరపాటున ఒక బ్...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం ఎక్కడ వుందంటే

Image
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీపురం (తిరుమలైకోడి) అనే గ్రామం ఉంటుంది. ఈ వూరిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. తిరుపతి యాత్రలో భాగంగా, మన తెలుగు రాష్ట్రాల భక్తులు చాలా మంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. శ్రీ నారాయణీ పీఠం వారి ఆధ్వర్యంలో నడపబడే "అనంత నిత్య" అనే గెస్ట్ హౌస్ వద్ధ ఒక భారీ నటరాజ స్వామివారి విగ్రహం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకునే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహంగా చెప్పబడుతోంది. 23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో అలరాడే "శ్రీ ఆనంద నటరాజ" విగ్రహం 15 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms Advertisement* లాస్ట్ వ్యాక్స్ (Lost Wax) ప్రక్రియలో పంచ లోహలైన బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం వంటివి ఉపయోగించుకుని సింగిల్ కాస్టింగ్ పద్ధతి ద్వారా రూపొందించబడినది. కావేరీ...

తిరుపోరూర్: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడుతో ఆకాశంలో యుద్ధం చేసి గెలిచిన క్షేత్రం !!

Image
తిరుపోరూర్ కందస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది. ఇది చెన్నైకి 30 కిలోమీటర్లు, అలాగే మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలిచే శివ-పార్వతుల తనయుడైన స్కందుడుని తమిళనాడులో "కందస్వామి" అని పిలుస్తారు. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, పోర్ అంటే యుద్ధం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడు అనే రాక్షసుడితో ఆకాశంలో యుద్ధం చేసి గెలవడంతో, ఈ ప్రాంతానికి "తిరు-పోర్-ఊర్" అని పేరు వచ్చింది. అలాగే ఈ ప్రాంతాన్ని సమరపురి మరియు తారకాపురి అని కూడా పిలిచేవారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అగస్త్య మునికి వేదాలకు పునాది అయిన ప్రణవం గురించి వివరించాడని చెబుతారు. మదురైకి చెందిన చిదంబర స్వామి అనే సాధువు ఒక తాటిచెట్టు క్రిందనున్న పుట్టలో ఇప్పుడున్న విగ్రహాలను కనుగొన్నారని స్థలపురాణం చెబుతోంది. అందుకే స్వయంభువుగా వెలిసిన ఈ విగ్రహమూర్తులకు అభిషేకాలు ఉండవు, అన్ని ప్రత్యేక అభిషేకాలు ఇక్కడున్న సుబ్రహ్మణ్య యంత్రానికి మాత్రమే చేస్తారు. తొలుత 10వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరింతగా విస్తరించారని శాసనాలు...

అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో ఇడుక్కు పిళ్లైయార్ ఆలయం !!

Image
ఓం గం గణపతియే నమః !!  ఇడుక్కు పిళ్లైయార్ ఆలయం అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో కుబేర లింగం మరియు ఈశాన్య లింగాలకు వెళ్ళే దారి మధ్యలో నెలకొని ఉంటుంది.  తమిళంలో పిళ్లైయార్ అంటే వినాయకుడు. ఒక చిన్న గోపురంతో పొట్టిగా ఉండే స్థూపంలా నిర్మించబడిన ఈ ఆలయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. లోపల ఎటువంటి దేవుని విగ్రహం లేకపోయినా బయట మాత్రం నంది వేంచేసి ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు. కాయ కల్పం ప్రక్రియను రూపొందించిన ఇడైకాడు సిద్ధర్ అనే గొప్ప యోగి ఈ ఆలయం లోపల యంత్ర ప్రతిష్ట చేసినట్లుగా చెబుతారు. ఈ ఇడుక్కు పిళ్లైయార్ ఆలయానికి "మోక్ష మార్గం" అని కూడా పేరు ఉంది. ఈ ఆలయ మధ్యభాగంలో ఉన్న ఇరుకు మార్గం గుండా ఒక వైపుకు ఒత్తిగిల్లి నెమ్మదిగా పాకుతూ బయటకు వస్తే, మనలోని అహంకారం మరియు మనల్ని ఆవహించిన అన్నిరకాల దుష్టశక్తులు వైదొలగి, మనకు మున్ముందు ఒక సుసంపన్నమైన జీవితం కలుగుతుందని చెబుతారు. అలాగే జీవితంలో ఏవైనా కష్టాలు, సమస్యలు ఉంటే వాటి నుండి సునాయాసంగా బయటపడి ఒక గట్టున పడతామని మరి కొందరు భావిస్తారు. బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on Chair & Reading Ramayana with Kuber Diya -...

ఎవరికీ అంతగా తెలియని షడారణ్య క్షేత్రం "తెన్నంగూర్" ప్రత్యేకత ఏమిటి ?!

Image
తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలై జిల్లాలోని వందవాసి తాలూకాలో "తెన్నంగూర్" అనే ఒక ఊరు ఉంటుంది. ఇది కాంచీపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరు అడవుల మధ్య ఉన్నందుకు తెన్నంగూర్ గ్రామాన్ని షడారణ్య క్షేత్రం అని పిలిచేవారు.  ఈ ఊరిలో నెలకొన్న శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పాండ్య రాజు అయిన మలయధ్వజుడు, అతని భార్య కాంచనమాల దంపతులకు ఎంతో కాలంగా పిల్లలు లేకపోవడంతో ఈ తెన్నంగూర్ గ్రామంలో పుత్రకామేష్టి యాగం చేస్తారు. అప్పుడు పవిత్ర జ్వాలల నుండి ఒక ఆడపిల్ల ఉద్భవిస్తుంది. పాండ్య రాజు దంపతులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.  మీనాక్షి దేవి యుక్త వయసుకు వచ్చినపుడు పాండ్య రాజు ఆమెను తన రాజ్యానికి వారసురాలు పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత పరమశివునికి ఇచ్చి వివాహం చేయడం మనందరికీ తెలిసిన విషయమే !! సాక్షాత్తూ మదురై మీనాక్షి దేవి ఇక్కడ జన్మించడం వల్ల ఈ వూరికి "దక్షిణ హలాస్యం" అనే పేరు వచ్చింది. | అదనపు సమాచారం:  కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !! స్వామి జ్ఞాననంద గిరి వారి శిష్యుడు అయిన స్వామి హరిధోస్ గిరి (గురూజీ) ...

కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !!

Image
లేఖిని హస్తాయ విద్మహే పత్రధరాయ ధీమహి తన్నో చిత్ర ప్రచోదయాత్ !! సాధారణంగా చిత్రగుప్తుడికి ఆలయం ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కాంచీపురంలో బస్ స్టాండ్ కి సమీపంలో ఉన్న శ్రీ చిత్రగుప్త స్వామి వారి ఆలయం అందులో ఒకటి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్ధంలో చోళ రాజులు నిర్మించారు. యమధర్మరాజు గారి కొలువులో ఉండే చిత్రగుప్తుడు మనుషులు చేసే పాపపుణ్యాలకు చిట్టాలు రాస్తూ, వారు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమా లేదా నరకమా అని తేల్చి చెబుతాడని మనకు తెలుసు. అందుకే ఈ ఆలయంలో మూలమూర్తి కుడిచేతిలో కలం, ఎడమచేతిలో చిట్టా పట్టుకుని, ఆశీనుడై ఉన్న భంగిమలో దర్శనం ఇస్తాడు. బంగారు తొడుగులతో నిండి ఉన్న ఈ మూలమూర్తి, స్వర్ణతాపడం చేసిన గర్భగుడి మధ్యలో, నూనె దీపాల కాంతిలో ధగధగా మెరుస్తూ, దర్శనం ఇస్తూంటే చూడడానికి రెండు కళ్ళూ చాలవు. | అదనపు సమాచారం:  ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !! చిత్రగుప్తుడి యొక్క భార్య పేరు కర్ణికాంబాళ్. వీరిద్దరి పంచలోహ ఉత్సవమూర్తులను ఈ ఆలయంలో ఒక చోట చూడవచ్చు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే మే నెలలో వచ్చే “చిత్ర పౌర్ణమి” ...

Robot 2.0 మూవీలో చూపించిన పక్షితీర్థం ఆలయం — పూర్తి వివరాలు మీకోసం !!

Image
మన తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన "పక్షితీర్థం" తమిళనాడు రాష్ట్రంలోని తిరుక్కలికుండ్రంలో ఉంది.  ఈగల్ టెంపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రముఖ శైవక్షేత్రం చెన్నైకి 70 కిలోమీటర్లు, చెంగల్పట్టు పట్టణానికి మరియు మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.   తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, కళుగు అంటే రాబందు మరియు కుండ్రం అంటే పర్వతం అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నందిపురి, ఇంద్రపురి, నారాయణపురి, బ్రహ్మపురి, దినకరపురి, మునిగానాపురి అనే పేర్లతో పిలిచేవారు. కోటి మంది రుద్రులు ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరీశ్వరస్వామిని ఆరాధించినట్లుగా పురాణాలు చెప్పటంవల్ల ఈ క్షేత్రానికి రుద్రకోటి అని కూడా పేరు. కొండ పైన వెలసిన శ్రీ వేదగిరీశ్వర స్వామివారి ఆలయం చేరుకోవడానికి మెట్ల మార్గం అందుబాటులో ఉంది. ఈ మెట్లదారి మొదట్లో నిర్మించిన మండపం కొండ ఎక్కే భక్తులతో అలాగే కొండ దిగే భక్తులతో చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ మండపంలో వేంచేసిన వినాయకుడికి భక్తులు మొదటగా నమస్కరించి, ఆ తర్వాత వేదగిరీశ్వర స్వామివారి పాదాలు దర్శించి కొండ మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. | గూగుల్ మ్యాప్ లింక్:  శ్రీ వేదగిరీశ్వర స్వామివా...

పౌర్ణమి నాడు అరుణాచల గిరిప్రదక్షిణం: అష్ట లింగాలను ఎలా దర్శించుకోవాలి?? పూర్తి వివరాలు మీకోసం...

Image
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలయే ! స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః !! చిదంబరం వెళ్లి పరమ శివుడిని దర్శనం చేసుకున్నా, తిరువారూర్ లో జన్మించినా, తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వరుడిని స్మరించినా, కాశీలో మరణించినా మోక్షం తప్పక లభిస్తుంది.  అతి సులువైన “అరుణాచల” నామమే ఎన్నో కష్టాలను, పాపాలను తొలగిస్తుంది. అదే అరుణాచలం దర్శించినా, గిరి ప్రదక్షిణం చేసినా విశేష ఫలితం కలుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరుణాచలం...అరుణ అచలం...అంటే ఎర్రని రంగులో ఉన్న పర్వతం. ఈ కొండ స్థూలరూపంలో ఉన్న శివుడిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈ అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణం చేసినట్లే. ఈ కొండని అన్నామలై, అరుణగిరి, అరుణాచలం, అరుణై, సోనగిరి, సోనాచలం అని కూడా పిలుస్తారు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* పరమశివుని అవతారంగా చెప్పబడే జ్ఞానగురువు శ్రీ దక్షిణామూర్తిస్వామి వారు, ఒక సిద్ధయోగి రూపంలో ఇప్పటకీ ఈ కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తులు నమ్మక...