Posts

Showing posts with the label chitragupta swamy temple

కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !!

Image
లేఖిని హస్తాయ విద్మహే పత్రధరాయ ధీమహి తన్నో చిత్ర ప్రచోదయాత్ !! సాధారణంగా చిత్రగుప్తుడికి ఆలయం ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కాంచీపురంలో బస్ స్టాండ్ కి సమీపంలో ఉన్న శ్రీ చిత్రగుప్త స్వామి వారి ఆలయం అందులో ఒకటి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్ధంలో చోళ రాజులు నిర్మించారు. యమధర్మరాజు గారి కొలువులో ఉండే చిత్రగుప్తుడు మనుషులు చేసే పాపపుణ్యాలకు చిట్టాలు రాస్తూ, వారు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమా లేదా నరకమా అని తేల్చి చెబుతాడని మనకు తెలుసు. అందుకే ఈ ఆలయంలో మూలమూర్తి కుడిచేతిలో కలం, ఎడమచేతిలో చిట్టా పట్టుకుని, ఆశీనుడై ఉన్న భంగిమలో దర్శనం ఇస్తాడు. బంగారు తొడుగులతో నిండి ఉన్న ఈ మూలమూర్తి, స్వర్ణతాపడం చేసిన గర్భగుడి మధ్యలో, నూనె దీపాల కాంతిలో ధగధగా మెరుస్తూ, దర్శనం ఇస్తూంటే చూడడానికి రెండు కళ్ళూ చాలవు. | అదనపు సమాచారం:  ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !! చిత్రగుప్తుడి యొక్క భార్య పేరు కర్ణికాంబాళ్. వీరిద్దరి పంచలోహ ఉత్సవమూర్తులను ఈ ఆలయంలో ఒక చోట చూడవచ్చు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే మే నెలలో వచ్చే “చిత్ర పౌర్ణమి” ...