Posts

Showing posts with the label Tirupati

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు ??

Image
అనంతాళ్వార్ల తోట: తిరుమల క్షేత్రంలో జరిగిన అద్భుతాలకు, చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షి !! తిరుమల మాడవీధుల్లో నైరుతి దిశలో W-1 గేట్ వద్ద "శ్రీ అనంతాళ్వార్ల తోట" ఉంటుంది. ఇందులోనే ఆయన బృందావనం (మోక్ష స్థలం) కూడా ఉన్నది. ఇది కేవలం ఒక పూల తోట కాదు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, జరిగిన అద్భుతాలకు మన కంటి ముందు కనిపించే ఒక ప్రత్యక్ష సాక్ష్యం !! అనంతాళ్వార్ శ్రీ రామానుజాచార్యులు వారి ప్రియ శిష్యుడు. అప్పట్లో తిరుమల క్షేత్రం దట్టమైన అడవితో, సంచరించే వన్య మృగాలతో, క్రిమికీటకాదులతో ఎంతో భయానకంగా ఉండేది. అయినా కానీ, గురువు గారి ఆజ్ఞ మేరకు అనంతాళ్వార్ తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని, స్వామి వారి అర్చనాది కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజూ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే రామానుజాచార్యులువారు చెప్పిన విధంగా, పుష్ప కైంకర్యానికి ఉపయోగపడే విధంగా ఒక చెరువుని తవ్వి, పెద్ద పూల తోటను పెంచాలని అనంతాళ్వార్ అనుకుంటాడు. గర్భవతైన తన భార్యతో కలిసి అనంతాళ్వార్ రోజూ మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయక మట్టిని తవ్వుతూ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ అంకుఠిత దీక్షకు మెచ్చిన శ్రీ  వేంకటేశ్వర స్వామి వారి...

గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !!

Image
భారతదేశంలో తొలి శివాలయంగా పిలవబడుతున్న 2600 సంవత్సరాల నాటి శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయం గుడిమల్లంలో ఉన్నది.  తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో పాపానాయుడు పేటకు దగ్గరిలో గుడిమల్లం గ్రామంలో ఉంటుంది. ఇది రేణిగుంటకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడిమల్లం ఆలయాన్ని 2వ శతాబ్దంలో శాతవాహనులు ఇటుకలతో కట్టినట్లు, ఆ తర్వాత 8వ శతాబ్దంలో పల్లవ రాజులు రాతితో పునర్నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా గర్భాలయంలోని మూలమూర్తి గురించి తెలుసుకుందాం !! | అదనపు సమాచారం:  మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? మిగతా ఆలయాల్లో మాదిరిగా కాకుండా, ఇక్కడ ఏక శిలపై త్రిమూర్తులు ఉండడం చాలా విశేషం. బ్రహ్మగారు మరుగుజ్జు అయిన యక్షుని రూపంలో, విష్ణుమూర్తి పరశురాముని అవతారంలో, శివుడు పురుషాంగ స్వరూపంలో దర్శనమిస్తారు. గర్భాలయం సుమారు 6 అడుగుల లోతులో ఉండడం వల్ల ఈ వూరిని గుడి పల్లం అని పిలిచేవారు. కాల క్రమేణా అది కాస్తా గుడి మల్లం అయ్యింది అని చెబుతారు. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదీ జలాలు శ్ర...

తిరుపతిలో ఉండాల్సిన శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుచానూరులో ఎందుకు వున్నారు ??

Image
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి “పద్మ సరోవరం” అని పేరు. ఈ పుష్కరిణికి వాయువ్య దిశలో (North-West) ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ నెంబరు 5 పక్కనే ఉన్న ఒక చిన్న మందిరంలో శ్రీ రంగనాథ స్వామివారు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉండడం చూడవచ్చు. నిజానికి ఈ విగ్రహం తిరుపతి నడిబొడ్డున వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ములవిరాట్టుగా పూజలు అందుకోవాలి. అయితే ఎందుకనో శ్రీ రామానుజాచార్యులవారు ఈ విగ్రహ రూపురేఖలపై అంతగా సంతృప్తిచెందనట్లుగా తెలుస్తోంది. ఇక ముహూర్తసమయం దగ్గరపడడంతో, సున్నపురాయితో తయారు చేయబడిన మరో విగ్రహాన్ని గోవింద రాజస్వామి వారి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అందుకే గోవింద రాజస్వామి వారి ఆలయంలోని ఇప్పుడున్న మూలమూర్తికి అభిషేకాలు జరపరు. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? జాతకం అనుకూలించక కొన్ని సెకన్ల వ్యవధిలో రాజయోగం చేజారడం అంటే ఇదేనేమో !! చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass Advertisement* ఏది ఏమైనప్పట...

తిరుపతిలో వకుళమాత ఆలయం చాలా బాగా డెవలప్ చేసారు. ఏ మాత్రం మిస్ కాకుండా దర్శించండి !!

Image
వకుళాదేవి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పెంచిన తల్లి అని మన అందరికీ తెలిసిన విషయమే !! ఈమె ద్వాపరయుగంలో యశోద, అయితే శ్రీకృష్ణుడి యొక్క వివాహాలు ఏ ఒక్కటీ తన చేతులు మీదుగా జరగక పోవడం వల్ల, వకుళమాతకు కలియుగంలో ఆ అవకాశం దక్కేలా వరం పొందినది !! తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరుబండ గుట్టపై వకుళమాతకు ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం 1198వ సంవత్సరంలో మూడవ కుళోత్తుంగ చోళరాజు కాలంలో నిర్మించబడినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ఆలయం, 320 ఏండ్ల క్రితం మైసూర్ పాలకుడైన హైదర్ అలీ దండయాత్రల్లో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే చాలా వివాదాల తర్వాత, TTD వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి చాలా సుందరంగా పునర్నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని జూన్ 2023 లో ప్రారంభించడం జరిగినది. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? పేరూరు బండపై నెలకొన్న వకుళమాత ఆలయంలో నైవైద్యం అయిన తర్వాతే, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదన జరుగుతుంది అని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, తిరుమల ఆలయంలో మా...

SV Vedic Sivalayam: మహాశివరాత్రి రోజున SVBC TVలో చూపించే శివలింగం ఇదే !!

Image
TTD వారి SVBC TV Studio తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ నుంచి జూపార్క్ కి వెళ్ళే బైపాస్ రోడ్డులో ఉంటుంది. SVBC శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసు పక్కనే ఉన్న స్థలంలోనే శ్రీవారి నమూనా ఆలయం, అలాగే అటు ప్రక్కన SV Vedic Sivalayam కూడా ఉంటుంది. ప్రతీ మహాశివరాత్రి రోజున SVBC TVలో మీరు చూసే శివలింగం ఇదే !! పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ధ్యానారామంలో నెలకొన్న మహా శివలింగాన్ని దర్శిస్తే మన మనస్సు ఎంతో భక్తి భావనతో ఉప్పొంగుతుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ శిలతో తయారుచేయబడిన ఈ శివలింగం యొక్క ఎత్తు 11 అడుగులు, అలాగే బరువు సుమారు 25 టన్నులు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* కోటి రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి, తొందరలోనే ఆలయం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా SV Vedic Sivalayam దర్శించి, తరించండి. మీ సౌలభ్యం కొరకు, గూగుల్ మ్యాప్ డీటైల్స్ కిందనున్న description box లో ఇచ్చాను. | అదనపు సమాచారం...