Posts

Showing posts with the label Chennai

తిరుపోరూర్: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడుతో ఆకాశంలో యుద్ధం చేసి గెలిచిన క్షేత్రం !!

Image
తిరుపోరూర్ కందస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది. ఇది చెన్నైకి 30 కిలోమీటర్లు, అలాగే మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలిచే శివ-పార్వతుల తనయుడైన స్కందుడుని తమిళనాడులో "కందస్వామి" అని పిలుస్తారు. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, పోర్ అంటే యుద్ధం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడు అనే రాక్షసుడితో ఆకాశంలో యుద్ధం చేసి గెలవడంతో, ఈ ప్రాంతానికి "తిరు-పోర్-ఊర్" అని పేరు వచ్చింది. అలాగే ఈ ప్రాంతాన్ని సమరపురి మరియు తారకాపురి అని కూడా పిలిచేవారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అగస్త్య మునికి వేదాలకు పునాది అయిన ప్రణవం గురించి వివరించాడని చెబుతారు. మదురైకి చెందిన చిదంబర స్వామి అనే సాధువు ఒక తాటిచెట్టు క్రిందనున్న పుట్టలో ఇప్పుడున్న విగ్రహాలను కనుగొన్నారని స్థలపురాణం చెబుతోంది. అందుకే స్వయంభువుగా వెలిసిన ఈ విగ్రహమూర్తులకు అభిషేకాలు ఉండవు, అన్ని ప్రత్యేక అభిషేకాలు ఇక్కడున్న సుబ్రహ్మణ్య యంత్రానికి మాత్రమే చేస్తారు. తొలుత 10వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరింతగా విస్తరించారని శాసనాలు...

చెన్నైలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి "సుందర" నివాసం !!

Image
" సత్యం, శివం, సుందరం " - ఇది పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి జీవిత చరిత్రకి సంబంధించిన ఒక పుస్తకం. ఇవే పేర్లతో ఆయనకు భారతదేశంలోని మూడు ప్రముఖ నగరాల్లో నివాస భవనాలు కూడా ఉన్నాయి. 1968న ముంబైలో "సత్యం", 1973 ఏప్రిల్‌న హైదరాబాద్‌లో “శివం”, ఇక 1981 జనవరి 19న చెన్నైలో "సుందరం" అనే మూడు ప్రధాన నివాస భవనాలను ఆయన ఆవిష్కరణ చేశారు. వాస్తవానికి 1970 దశకంలోనే సత్యసాయి బాబా గారికి చెన్నైలో ఒక నివాస భవనం ఏర్పాటు కావాల్సి ఉండేది, కానీ రకరకాల కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యి, చివరకి 1981లో "సుందరం" రూపుదిద్దుకుంది. 55 అడుగుల ఎత్తులో ఉండే ఈ నివాస భవనం బాబా గారి 55వ జన్మదిన సంవత్సరంలో పూర్తి కావడం ఒక విశేషం. ఈ భవన రూపకల్పన, నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్ విషయాల్లో బాబా వారి ప్రమేయం చాలా ఉన్నది. | అదనపు సమాచారం:  చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !! పుట్టపర్తి నుండి సత్యసాయి గారు భారతదేశంలో ఎక్కడకు వెళ్లాలన్నా చెన్నై ప్రధాన కేంద్రంగా ఆయన ప్రయాణాలు జరిగేవి. లేత గులాబీ మరియు పసుపు వర్ణాలతో రాజసంగా కనిపించే "సుందరం" అనేది కేవలం బాబా...

చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తి. తి. దే.) వారు రెండు ఆలయాలను నిర్మించారు. ఆ రెండు ఆలయాలు మన తెలుగు వారు ఎక్కువగా నివసించే టి.నగర్ ప్రాంతంలోనే ఉంటాయి.  1. వేంకటనారాయణ రోడ్డు: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు, శనివారం నాడు మాత్రం అదనంగా ఒక గంట పొడిగిస్తారు.  1975లో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారిని సాధారణ రోజుల్లో 10 వేలమంది, వారాంతం రోజుల్లో 15 వేలమంది భక్తులు దర్శించుకుంటారు.  ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న తి. తి. దే. ఆఫీసులో మూల మూర్తుల అలంకరణకు వస్త్రాలు, పుష్ప మాలలు, బంగారు, వెండి ఆభరణాలు అలాగే TTD ట్రస్ట్ కు సంబంధించిన డొనేషన్లు స్వీకరిస్తారు.  మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* ప్రతీ శనివారం లడ్డూ ప్రసాద విక్రయాలు ఉంటాయి. వాటితో పాటు స్వామివారి డాలర్లు, పుస్తకాలు, పంచగవ్య ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంచుతారు.  150 కోట్ల రూ...

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఇల్లు చెన్నైలో ఎక్కడ వుందంటే…

Image
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఈ దీక్షను అప్పటి మద్రాసులో ఎక్కడ చేసారు, అలాగే ఆ ఇల్లు ఇప్పుడు ఎలా వుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి !! నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు గారి కుటుంబం 1876లో మద్రాసుకు వలస వెళ్లింది. 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. మహాత్మా గాంధీ గారు బోధించిన సత్యము, అహింస మరియు హరిజనోద్ధరణ అనే ఆశయాలను పుణికి పుచ్చుకున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాల్లో భాగంగా ఎన్నో సార్లు జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. | అదనపు సమాచారం:  శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తెలుగు వాళ్ళు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవారు. కానీ తెలుగు భాషకు మరియు తెలుగు వారికి సరైన ప్రాధాన్యత ఏమాత్రం ఉండేది కాదు. అందుకని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు, పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న అప్పటి మద్రాసు మాజీ స్పీకర్ అయిన బులుసు సాంబమూర్తి వారికి చెందిన ...

పంచ భాస్కర స్థలాలలో ఒకటైన సూర్య దేవాలయం చెన్నైలో ఎక్కడ ఉందో తెలుసా ?!

Image
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర !  దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే !! సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం. ఆరోగ్య ప్రదాత కూడా. సాధారణంగా మనష్యులకు సూర్యుని యొక్క వివిధ పేర్లను పెట్టడం చూసి ఉంటాము. కానీ ఇపుడు మనం ఏకంగా సూర్యుడు అనే పేరుతో ఉన్న ఒక గ్రామం గురించి తెలుసుకుందాం !! జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయం చెన్నై చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాలలో ఒకటి. జ్ఞాయిరు అంటే తమిళంలో సూర్యుడు అని అర్థం. అలాగే తమిళనాడులో ఉన్న “పంచ భాస్కర” స్థలాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్దికెక్కింది. చెన్నై శివార్లలో ఉన్న రెడ్ హిల్స్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ జ్ఞాయిరు గ్రామం ఉంది. జ్ఞాయిరు గ్రామానికి వెళ్ళే దారి పంటపొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాస్తు దోష పరిహారం: Comelyns - Sun God Wall Decor - Brass, 290gms, 20x20X4 cm Advertisement* జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి ప్రవేశద్వారంగా 5 అంచెల చిన్న రాజగోపురం దక్షిణ దిక్కులో ఉంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య, పూల మొక్కలతో ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతం...

శంఖం మినహా వేరే ఆయుధాలు ధరించని శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇచ్చే ఒకే ఒక ఆలయం !!

Image
తిరువల్లిక్కేణి పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. చెన్నై మహానగరంలో వెలసిన ఈ పురాతన ఆలయం పార్థసారథి స్వామి వారికి సంబంధించినది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, అల్లిక్కేణి అంటే కలువ పువ్వులు ఉన్న చెరువు.  ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఎక్కువగా కలువ పువ్వులతో నిండిన చెరువులతో ఉండడం వల్ల తిరువల్లిక్కేణి అని పేరు వచ్చింది. కాలక్రమంలో బ్రిటిష్ వారి పాలనలో ఆ పేరు ట్రిప్లికేన్ గా రూపాంతరం చెందింది. సుమతి అనే ఒక రాజుగారి కోరిక మేరకు తిరుమలలోని శ్రీనివాసుడే ఇక్కడ పార్థసారథిగా వెలసినట్లు, అలాగే ఆత్రేయ మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఐతిహ్యం. సంస్కృత భాషలో పార్థసారథి అంటే అర్జునుడు యొక్క రథాన్ని నడిపినవాడు అని అర్థం.  ఈ ఆలయంలో ప్రధాన దైవం- విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడు. మరెక్కడా లేని విధంగా, ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఒకటి తూర్పువైపునున్న గర్భగుడికి ఎదురుగా, మరొకటి పడమరవైపునున్న యోగనరసింహ స్వామి వారి దేవాలయానికి ఎదురుగా ఉంటాయి.  తెలుగులో గీతా ప్రెస్ వారి శ్రీమద్భగవద్గీత: Srimad B...

ఏటిగట్టు తెగకుండా గస్తీ కాసిన రామలక్ష్మణులు; బ్రిటిష్ అధికారే వారికి ఆలయాన్ని నిర్మించాడు !!

Image
భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు, అంటే 1798 సంవత్సరంలో, చెన్నైకి సమీపంలోని మధురాంతకం ప్రాంతం భారీవర్షాలతో అతలాకుతలమైనది. అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్- కల్నల్ లియోనెల్ బ్లేజ్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడు ఏటిగట్టుకు గండి పడుతుందో అని భయపడుతూ, ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ క్యాంప్ చేస్తాడు.  ఆ రాత్రి గంటగంటకు వరద ఉధృతి తీవ్రంగా పెరిగిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బ్రిటిష్ అధికారి, ఇక్కడ వెలసిన శ్రీ కోదండ రామస్వామి వారిని ఎంతో భక్తితో వేడుకుంటాడు. అప్పుడు చాలా ఆశ్చర్యంగా, ధనుర్బాణాలతో ఉన్న ఇద్దరు యోధులు ఏటిగట్టు తెగకుండా గస్తీ తిరుగుతూ ఉండడం అలాగే క్రమంగా వర్షం తగ్గిపోవడం కూడా జరుగుతుంది.  బ్రిటిష్ అధికారికి ఆ వచ్చిన ఇద్దరూ సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులుగా నిజాన్ని గ్రహించి కృతజ్ఞతా భావంతో సీతారాములవారి ఆలయాల పునర్నిర్మాణాన్ని దగ్గరుండి చేయిస్తాడు. వరదల సమయంలో ఏరు పొంగకుండా ఈ ప్రాంతాన్ని కాపాడినందుకు మధురాంతకం ప్రజలు రాములవారిని “ఏరికాత్త రామర్ (ఏటిని కాపాడిన రాములవారు)” అని పిలుచుకుంటారు.   సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ కోదండ రామస్వామి 8 అడుగుల ఆజానుబాహు రూపంలో త...