Posts

Showing posts with the label TTD

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు ??

Image
అనంతాళ్వార్ల తోట: తిరుమల క్షేత్రంలో జరిగిన అద్భుతాలకు, చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షి !! తిరుమల మాడవీధుల్లో నైరుతి దిశలో W-1 గేట్ వద్ద "శ్రీ అనంతాళ్వార్ల తోట" ఉంటుంది. ఇందులోనే ఆయన బృందావనం (మోక్ష స్థలం) కూడా ఉన్నది. ఇది కేవలం ఒక పూల తోట కాదు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, జరిగిన అద్భుతాలకు మన కంటి ముందు కనిపించే ఒక ప్రత్యక్ష సాక్ష్యం !! అనంతాళ్వార్ శ్రీ రామానుజాచార్యులు వారి ప్రియ శిష్యుడు. అప్పట్లో తిరుమల క్షేత్రం దట్టమైన అడవితో, సంచరించే వన్య మృగాలతో, క్రిమికీటకాదులతో ఎంతో భయానకంగా ఉండేది. అయినా కానీ, గురువు గారి ఆజ్ఞ మేరకు అనంతాళ్వార్ తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని, స్వామి వారి అర్చనాది కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజూ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే రామానుజాచార్యులువారు చెప్పిన విధంగా, పుష్ప కైంకర్యానికి ఉపయోగపడే విధంగా ఒక చెరువుని తవ్వి, పెద్ద పూల తోటను పెంచాలని అనంతాళ్వార్ అనుకుంటాడు. గర్భవతైన తన భార్యతో కలిసి అనంతాళ్వార్ రోజూ మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయక మట్టిని తవ్వుతూ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ అంకుఠిత దీక్షకు మెచ్చిన శ్రీ  వేంకటేశ్వర స్వామి వారి...

తిరుమల కొండకు గ్రామ దేవత ఎవరంటే ...

Image
చాలా మంది తిరుమల యాత్రలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తల నీలాలు సమర్పించి, ఆ తర్వాత ఆయన దర్శనం చేసుకుని, లడ్డూ ప్రసాదం తీసుకుని ఆదర బాదరగా ఊరికి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. తిరుమల కొండపైన చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా మందికి తెలియని, ఒక సుందరమైన ప్రదేశం గురించి ఇప్పుడు మీకు చెబుతాను !! తిరుమల కొండపైన వరాహస్వామి గెస్ట్ హౌస్-2 కి ఎదురుగా ఉన్న రోడ్డులో, అంటే పాపవినాశనంకి వెళ్ళే కాలినడక దారిలో బాట గంగమ్మ గుడి ఉంది. బాట గంగమ్మను తిరుమల ప్రాంతానికి గ్రామ దేవతగా కొలుస్తారు. ఈవిడ శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సోదరి అవుతుందని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడివితో, వన్యమృగాలు సంచరిస్తూ భయానకంగా ఉండేది. అయినా తిరుమలలోని అర్చకులు, ప్రతిరోజూ స్వామివారి అభిషేకం గురించి పాపవినాశనం నుండి పవిత్ర జలాలను మోసుకుంటూ ఈ కాలినడక దారిలోనే తీసుకుని వచ్చేవారు.  కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch Advertisement* ఈ బాటలో వెళ్ళే అర్చకులకు ఇక్కడ స్వయంభువుగా వెలసిన గంగమ్మ తల్లి రక్ష ఇస్తూ ఉ...

తిరుమల శ్రీవారి పుష్కరిణి ఎన్నో రహస్యాలకు నెలవు, వాటిలో మీకు ఎన్ని తెలుసు ?!

Image
శాస్త్రాణాం పరమో వేదః దేవానాం పరమో హరిః ! తీర్థానాం పరమం తీర్థం స్వామిపుష్కరిణీ నృప !! అన్ని శాస్త్రాలలో గొప్పది వేదం, సకల దేవతలలో ఉత్తముడు శ్రీవేంకటేశ్వర స్వామి, ఇక తీర్థాల్లో ఉత్తమమైనది తిరుమల మాడ వీధుల్లోని ఈశాన్య దిక్కులో నెలకొని ఉండే స్వామివారి పుష్కరిణి.  శ్రీమహావిష్ణువు ఆజ్ఞమేరకు, గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తెచ్చి తిరుమల క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన శ్రీవారి పుష్కరిణి సర్వ తీర్థాలకు నిలయం. ఇందులో ఉత్తరం వైపున వరాహ పుష్కరిణి, మధ్యలో ఉన్న నీరాళి మండపం వద్ద సరస్వతీ నది సమ్మేళనమై ఉంటాయి. అంతే కాకుండా పుష్కరిణికి ఎనిమిది దిక్కులలో ఐదుగురు అష్టదిక్పాలకులు మరియు ముగ్గురు మహర్షులు తమ శక్తులు ధారపోసి స్వామి పుష్కరిణిని మరింత మహిమాన్వితం చేశారు.  ఇంకా ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి సూర్యోదయం వేళ, అంటే కూర్మ ద్వాదశి రోజున, ముల్లోకాల్లో ఉన్న సమస్త తీర్థాలన్నీ వచ్చి చేరుతాయి. ఆ రోజును “శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధ ముక్కోటి" అనే మహా పర్వదినంగా భావిస్తారు. ఈ పుష్కరిణి గట్టున ఎన్నో ఆలయాలు, మందిరాలు కూడా విరాజిల్లుతున్నా...

అల... వైకుంఠపురములో... "నగరి"లో !!

Image
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై !! మీకు మన పురాణాలలో వర్ణించిన ఘట్టాలను, వాటి తాలూకా ఆనవాళ్ళను తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నదా?  అలాంటి ఘట్టాలను గుర్తుకు తెప్పించే ఆలయాలు ఎక్కడున్నా, మీకు దర్శించే ఆసక్తి ఉన్నదా??  అలా  అయితే, ఈ బ్లాగ్ మీ కోసమే... చదివి ఆనందించండి !! చిత్తూరు జిల్లాలో తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో నగరి పట్టణం ఉంటుంది. ఇక్కడ నెలకొన్న శ్రీ కరియ మాణిక్యస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భాగవతంలో వర్ణించబడిన గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టం, అంటే శ్రీ మహావిష్ణువు మకరాన్ని (మొసలి) చంపి కరిని (ఏనుగు) రక్షించడం అనేది ఇక్కడ జరిగినట్లుగా చెబుతారు. | గూగుల్ మ్యాప్ లింక్:  శ్రీ భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారి ఆలయం (నగరి) అందుకే ఈ ఆలయంలో శ్రీ  భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారు వరద హస్తంతో కాకుండా, అభయ హస్తంతో దర్శనం ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలోని అన్ని ఉత్సవాల...

తిరుపతిలో ఉండాల్సిన శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుచానూరులో ఎందుకు వున్నారు ??

Image
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి “పద్మ సరోవరం” అని పేరు. ఈ పుష్కరిణికి వాయువ్య దిశలో (North-West) ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ నెంబరు 5 పక్కనే ఉన్న ఒక చిన్న మందిరంలో శ్రీ రంగనాథ స్వామివారు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉండడం చూడవచ్చు. నిజానికి ఈ విగ్రహం తిరుపతి నడిబొడ్డున వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ములవిరాట్టుగా పూజలు అందుకోవాలి. అయితే ఎందుకనో శ్రీ రామానుజాచార్యులవారు ఈ విగ్రహ రూపురేఖలపై అంతగా సంతృప్తిచెందనట్లుగా తెలుస్తోంది. ఇక ముహూర్తసమయం దగ్గరపడడంతో, సున్నపురాయితో తయారు చేయబడిన మరో విగ్రహాన్ని గోవింద రాజస్వామి వారి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అందుకే గోవింద రాజస్వామి వారి ఆలయంలోని ఇప్పుడున్న మూలమూర్తికి అభిషేకాలు జరపరు. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? జాతకం అనుకూలించక కొన్ని సెకన్ల వ్యవధిలో రాజయోగం చేజారడం అంటే ఇదేనేమో !! చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass Advertisement* ఏది ఏమైనప్పట...

తిరుపతిలో వకుళమాత ఆలయం చాలా బాగా డెవలప్ చేసారు. ఏ మాత్రం మిస్ కాకుండా దర్శించండి !!

Image
వకుళాదేవి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పెంచిన తల్లి అని మన అందరికీ తెలిసిన విషయమే !! ఈమె ద్వాపరయుగంలో యశోద, అయితే శ్రీకృష్ణుడి యొక్క వివాహాలు ఏ ఒక్కటీ తన చేతులు మీదుగా జరగక పోవడం వల్ల, వకుళమాతకు కలియుగంలో ఆ అవకాశం దక్కేలా వరం పొందినది !! తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరుబండ గుట్టపై వకుళమాతకు ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం 1198వ సంవత్సరంలో మూడవ కుళోత్తుంగ చోళరాజు కాలంలో నిర్మించబడినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ఆలయం, 320 ఏండ్ల క్రితం మైసూర్ పాలకుడైన హైదర్ అలీ దండయాత్రల్లో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే చాలా వివాదాల తర్వాత, TTD వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి చాలా సుందరంగా పునర్నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని జూన్ 2023 లో ప్రారంభించడం జరిగినది. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? పేరూరు బండపై నెలకొన్న వకుళమాత ఆలయంలో నైవైద్యం అయిన తర్వాతే, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదన జరుగుతుంది అని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, తిరుమల ఆలయంలో మా...

SV Vedic Sivalayam: మహాశివరాత్రి రోజున SVBC TVలో చూపించే శివలింగం ఇదే !!

Image
TTD వారి SVBC TV Studio తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ నుంచి జూపార్క్ కి వెళ్ళే బైపాస్ రోడ్డులో ఉంటుంది. SVBC శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసు పక్కనే ఉన్న స్థలంలోనే శ్రీవారి నమూనా ఆలయం, అలాగే అటు ప్రక్కన SV Vedic Sivalayam కూడా ఉంటుంది. ప్రతీ మహాశివరాత్రి రోజున SVBC TVలో మీరు చూసే శివలింగం ఇదే !! పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ధ్యానారామంలో నెలకొన్న మహా శివలింగాన్ని దర్శిస్తే మన మనస్సు ఎంతో భక్తి భావనతో ఉప్పొంగుతుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ శిలతో తయారుచేయబడిన ఈ శివలింగం యొక్క ఎత్తు 11 అడుగులు, అలాగే బరువు సుమారు 25 టన్నులు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* కోటి రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి, తొందరలోనే ఆలయం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా SV Vedic Sivalayam దర్శించి, తరించండి. మీ సౌలభ్యం కొరకు, గూగుల్ మ్యాప్ డీటైల్స్ కిందనున్న description box లో ఇచ్చాను. | అదనపు సమాచారం...

తిరుమల రహస్యం: పంచ పాండవ తీర్థంలో క్షేత్ర పాలక శిల ఎందుకు వుంది?

Image
సాధారణంగా శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి, వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్ర పాలకుడుగా ఉండడం చూడవచ్చు. భారతదేశంలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది. తిరుమల ఆలయానికి క్షేత్ర పాలకుడు రుద్రుడు, అంటే శివుడు. గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న పంచ పాండవ తీర్థంలో “క్షేత్ర పాలక శిల” ఉంటుంది. కానీ ఒకప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ప్రధాన ఆలయానికి ఈశాన్య మూలలో ఉండేది. ప్రతీ రోజూ పవళింపు సేవ అనంతరం, ఆలయాన్ని మూసివేసిన తర్వాత అర్చకులు ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది. అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల మాడవీధుల్లో దొర్లుతూ రాత్రంతా గస్తీ కాసేది. తెల్లవారు జామున సుప్రభాత సేవకు ఆలయాన్ని తెరిచే సమయంలో అర్చకులు మళ్ళీ ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది.  కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch Advertisement* అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ఇక గస్తీ తిరగడం ఆపి, తన యథాస్థానమైన ఈశాన్య మూలకు వచ్చి నిశ్చలంగా ఉండేది...

తిరుమల యాత్రలో జపాలీ తీర్థం అస్సలు మిస్ కావద్దు, ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది !!

Image
జాపాలి తీర్థం తిరుమల చుట్టూ ఉన్న పరమ పవిత్రమైన 108 దివ్యతీర్థాల్లో ఒకటి. దీనికే జాబాలి తీర్థం అని కూడా పేరు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  జాపాలి తీర్థం చేరుకోవాలంటే, పాపవినాశనము వెళ్ళే రోడ్డు మార్గం చాలా అనుకూలమైనది. శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం మరియు ఆకాశగంగకు వెళ్ళే దారిలో ఉంటుంది. ప్రధాన రహదారి నుండి 100 మీటర్ల లోపలకి వెళితే వాహనాలు నిలపడానికి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. అక్కడ నుంచి సుమారు అర కిలోమీటరు దూరం మెట్లమార్గంలో నడవాల్సి వస్తుంది. జాపాలి తీర్థం ఎత్తైన వృక్షాల నడుమ, పక్షుల కువకువలతో, చల్లని వాతావరణంలో చాలా ప్రశాంతంగా మరియు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇది తిరుమల యాత్రలో చూడాల్సిన ఒక గొప్ప పుణ్య క్షేత్రం, అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. తిరుమలకు గ్రామదేవత అయిన బాట గంగమ్మ తల్లి ఆలయం నుంచి పాపవినాశనము వెళ్ళే నడక దారి ఇక్కడ కలుస్తుంది. | అదనపు సమాచారం: జాబాలి తీర్థంకి వెళ్ళే దారిలో కనిపించే రుద్ర శిల (క్షేత్రపాలకుడు) యొక్క రహస్యం ఏమిటి? ఆలయం వెలుపన ఉన్న ఒక చెట్టు మొదట్లో సహజసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి రూపం ప్రత్యేక ఆకర్...