Posts

Showing posts with the label tamil nadu

శ్రీరంగంలో అన్నప్రసాద కేంద్రం: ఎంతో శుచిగా, రుచిగా, వేడిగా వడ్డిస్తారు !!

Image
శ్రీరంగంలో నెలకొన్న రంగనాథ స్వామివారి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతీ రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది, అలాగే భక్తుల రద్దీతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.  భక్తులకు మెరుగైన సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 2012న అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు.  సరిగ్గా మూడేళ్ల తర్వాత, అంటే సెప్టెంబర్ 2015లో వెయిటింగ్ హాల్ మరియు శాశ్వత అన్నదాన సత్రం భవనాలు ఆవిడచే ఆవిష్కరించబడ్డాయి. ఈ అన్నదాన కేంద్రంలో భక్తులకు చక్కగా ఒక టేబుల్ పైన అరిటాకు వేసి అందులో అన్నం, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగ మొదలైన పదార్ధాలను ఎంతో శుచిగా, రుచిగా మరియు వేడిగా వడ్డిస్తారు. ఈ అన్నప్రసాద కేంద్రం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో సుమారు 3 నుండి 4 వేల భక్తులకు ఆకలి బాధలను తీరుస్తోంది.  శ్రీ రంగ రంగ: ARTVARKO Lord Ranganatha Swamy - Touching Shiva Lingam, Brahma from Navel - Brass, 7.5 Inches Advertisement* ...

7 అడుగుల ఆజానుబాహుడు: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వల్లకోట్టై అనే ఒక చిన్న ఊరిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ ఆలయంలోనైనా 4 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండడం సహజం. అయితే భారతదేశం మొత్తంలో మరెక్కడా కానరాని విధంగా, ఇక్కడ మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 7 అడుగుల ఆజానుబాహు రూపంలో నిల్చుని వల్లీ దేవసేన సమేతంగా దర్శనం ఇవ్వడం చాలా విశేషంగా చెబుతారు. శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ వల్లకోట్టై ఊరు ఉంటుంది. మహిమాన్విత వల్లకోట్టై మురుగన్ ఆలయం తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలకు సమానంగా విరాజిల్లుతోంది. మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm Advertisement* ఈ క్షేత్రంలో స్థల వృక్షం- పాదిరి చెట్టు.  ఒకప్పడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తులు ఇక్కడున్న ఒక పాదిరి చెట్టు క్రిందనే స్వయంవ్యక్తం అయినట్లుగా తెలుస్తో...

ఏటిగట్టు తెగకుండా గస్తీ కాసిన రామలక్ష్మణులు; బ్రిటిష్ అధికారే వారికి ఆలయాన్ని నిర్మించాడు !!

Image
భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు, అంటే 1798 సంవత్సరంలో, చెన్నైకి సమీపంలోని మధురాంతకం ప్రాంతం భారీవర్షాలతో అతలాకుతలమైనది. అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్- కల్నల్ లియోనెల్ బ్లేజ్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడు ఏటిగట్టుకు గండి పడుతుందో అని భయపడుతూ, ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ క్యాంప్ చేస్తాడు.  ఆ రాత్రి గంటగంటకు వరద ఉధృతి తీవ్రంగా పెరిగిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బ్రిటిష్ అధికారి, ఇక్కడ వెలసిన శ్రీ కోదండ రామస్వామి వారిని ఎంతో భక్తితో వేడుకుంటాడు. అప్పుడు చాలా ఆశ్చర్యంగా, ధనుర్బాణాలతో ఉన్న ఇద్దరు యోధులు ఏటిగట్టు తెగకుండా గస్తీ తిరుగుతూ ఉండడం అలాగే క్రమంగా వర్షం తగ్గిపోవడం కూడా జరుగుతుంది.  బ్రిటిష్ అధికారికి ఆ వచ్చిన ఇద్దరూ సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులుగా నిజాన్ని గ్రహించి కృతజ్ఞతా భావంతో సీతారాములవారి ఆలయాల పునర్నిర్మాణాన్ని దగ్గరుండి చేయిస్తాడు. వరదల సమయంలో ఏరు పొంగకుండా ఈ ప్రాంతాన్ని కాపాడినందుకు మధురాంతకం ప్రజలు రాములవారిని “ఏరికాత్త రామర్ (ఏటిని కాపాడిన రాములవారు)” అని పిలుచుకుంటారు.   సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ కోదండ రామస్వామి 8 అడుగుల ఆజానుబాహు రూపంలో త...