Posts

Showing posts with the label nagari

అల... వైకుంఠపురములో... "నగరి"లో !!

Image
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై !! మీకు మన పురాణాలలో వర్ణించిన ఘట్టాలను, వాటి తాలూకా ఆనవాళ్ళను తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నదా?  అలాంటి ఘట్టాలను గుర్తుకు తెప్పించే ఆలయాలు ఎక్కడున్నా, మీకు దర్శించే ఆసక్తి ఉన్నదా??  అలా  అయితే, ఈ బ్లాగ్ మీ కోసమే... చదివి ఆనందించండి !! చిత్తూరు జిల్లాలో తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో నగరి పట్టణం ఉంటుంది. ఇక్కడ నెలకొన్న శ్రీ కరియ మాణిక్యస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భాగవతంలో వర్ణించబడిన గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టం, అంటే శ్రీ మహావిష్ణువు మకరాన్ని (మొసలి) చంపి కరిని (ఏనుగు) రక్షించడం అనేది ఇక్కడ జరిగినట్లుగా చెబుతారు. | గూగుల్ మ్యాప్ లింక్:  శ్రీ భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారి ఆలయం (నగరి) అందుకే ఈ ఆలయంలో శ్రీ  భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారు వరద హస్తంతో కాకుండా, అభయ హస్తంతో దర్శనం ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలోని అన్ని ఉత్సవాల...