Posts

Showing posts from June, 2025

ఎవరికీ అంతగా తెలియని షడారణ్య క్షేత్రం "తెన్నంగూర్" ప్రత్యేకత ఏమిటి ?!

Image
తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలై జిల్లాలోని వందవాసి తాలూకాలో "తెన్నంగూర్" అనే ఒక ఊరు ఉంటుంది. ఇది కాంచీపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరు అడవుల మధ్య ఉన్నందుకు తెన్నంగూర్ గ్రామాన్ని షడారణ్య క్షేత్రం అని పిలిచేవారు.  ఈ ఊరిలో నెలకొన్న శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పాండ్య రాజు అయిన మలయధ్వజుడు, అతని భార్య కాంచనమాల దంపతులకు ఎంతో కాలంగా పిల్లలు లేకపోవడంతో ఈ తెన్నంగూర్ గ్రామంలో పుత్రకామేష్టి యాగం చేస్తారు. అప్పుడు పవిత్ర జ్వాలల నుండి ఒక ఆడపిల్ల ఉద్భవిస్తుంది. పాండ్య రాజు దంపతులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.  మీనాక్షి దేవి యుక్త వయసుకు వచ్చినపుడు పాండ్య రాజు ఆమెను తన రాజ్యానికి వారసురాలు పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత పరమశివునికి ఇచ్చి వివాహం చేయడం మనందరికీ తెలిసిన విషయమే !! సాక్షాత్తూ మదురై మీనాక్షి దేవి ఇక్కడ జన్మించడం వల్ల ఈ వూరికి "దక్షిణ హలాస్యం" అనే పేరు వచ్చింది. | అదనపు సమాచారం:  కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !! స్వామి జ్ఞాననంద గిరి వారి శిష్యుడు అయిన స్వామి హరిధోస్ గిరి (గురూజీ) ...

చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తి. తి. దే.) వారు రెండు ఆలయాలను నిర్మించారు. ఆ రెండు ఆలయాలు మన తెలుగు వారు ఎక్కువగా నివసించే టి.నగర్ ప్రాంతంలోనే ఉంటాయి.  1. వేంకటనారాయణ రోడ్డు: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు, శనివారం నాడు మాత్రం అదనంగా ఒక గంట పొడిగిస్తారు.  1975లో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారిని సాధారణ రోజుల్లో 10 వేలమంది, వారాంతం రోజుల్లో 15 వేలమంది భక్తులు దర్శించుకుంటారు.  ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న తి. తి. దే. ఆఫీసులో మూల మూర్తుల అలంకరణకు వస్త్రాలు, పుష్ప మాలలు, బంగారు, వెండి ఆభరణాలు అలాగే TTD ట్రస్ట్ కు సంబంధించిన డొనేషన్లు స్వీకరిస్తారు.  మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* ప్రతీ శనివారం లడ్డూ ప్రసాద విక్రయాలు ఉంటాయి. వాటితో పాటు స్వామివారి డాలర్లు, పుస్తకాలు, పంచగవ్య ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంచుతారు.  150 కోట్ల రూ...

జపాన్ లో గణేశుడు: టోక్యో కొండ పైన గణపతి ఆలయం !!

Image
జపాన్ లో బాగా విస్తృతమైన బౌద్ధ మతంలో, మన గణేశుడుని కాంగిటెన్ లేదా షోడెన్ అనే పేర్లతో కొలుస్తారు. టోక్యో మహానగరంలో సుప్రసిద్ధమైన మత్సుచియమ షోడెన్ ఆలయం (Matsuchiyama Shoden Shrine) అసకుస (Asakusa) అనే ప్రాంతంలో ఒక చిన్న కొండపై ఉంటుంది. జపనీయుల భాషలో యమ అంటే కొండ లేదా పర్వతం అని అర్థం.  ఈ ఆలయం పచ్చటిచెట్ల మధ్య ప్రకృతి రమణీయత మరియు చిన్న సెలయేరులతో ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఇక్కడ నుంచి చూస్తే, టోక్యో నగరానికి తలమానికంగా చెప్పబడే స్కై ట్రీ టవర్ (Sky Tree Tower ) చాలా స్పష్టంగా కనబడుతుంది.  బౌద్ధ మతంలో టెండై (Tendai) అనే శాఖకు చెందిన మత్సుచియమ షోడెన్ ఆలయం 601 సంవత్సరంలో స్థాపించబడినదిగా చెబుతారు. అయితే యుద్ధ సమయంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం అవడం వల్ల దీనిని తిరిగి 1961లో పునర్నిర్మించారు. | అదనపు సమాచారం:  జపాన్ పార్క్ లో మన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి ఒక ఆలయం   కాంగిటెన్ దేవుడికి రెండు చిహ్నాలు ఉంటాయి- ఒకటి ముల్లంగి దుంప, మరొకటి డబ్బు సంచి. తెల్లగా నవనవలాడుతున్న ముల్లంగి దుంప స్వచ్చతకు, శరీర ఆరోగ్యానికి మరియు అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. అలాగే పెనవేసుకున్...

గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !!

Image
భారతదేశంలో తొలి శివాలయంగా పిలవబడుతున్న 2600 సంవత్సరాల నాటి శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయం గుడిమల్లంలో ఉన్నది.  తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో పాపానాయుడు పేటకు దగ్గరిలో గుడిమల్లం గ్రామంలో ఉంటుంది. ఇది రేణిగుంటకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడిమల్లం ఆలయాన్ని 2వ శతాబ్దంలో శాతవాహనులు ఇటుకలతో కట్టినట్లు, ఆ తర్వాత 8వ శతాబ్దంలో పల్లవ రాజులు రాతితో పునర్నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా గర్భాలయంలోని మూలమూర్తి గురించి తెలుసుకుందాం !! | అదనపు సమాచారం:  మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? మిగతా ఆలయాల్లో మాదిరిగా కాకుండా, ఇక్కడ ఏక శిలపై త్రిమూర్తులు ఉండడం చాలా విశేషం. బ్రహ్మగారు మరుగుజ్జు అయిన యక్షుని రూపంలో, విష్ణుమూర్తి పరశురాముని అవతారంలో, శివుడు పురుషాంగ స్వరూపంలో దర్శనమిస్తారు. గర్భాలయం సుమారు 6 అడుగుల లోతులో ఉండడం వల్ల ఈ వూరిని గుడి పల్లం అని పిలిచేవారు. కాల క్రమేణా అది కాస్తా గుడి మల్లం అయ్యింది అని చెబుతారు. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదీ జలాలు శ్ర...

7 అడుగుల ఆజానుబాహుడు: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వల్లకోట్టై అనే ఒక చిన్న ఊరిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ ఆలయంలోనైనా 4 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండడం సహజం. అయితే భారతదేశం మొత్తంలో మరెక్కడా కానరాని విధంగా, ఇక్కడ మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 7 అడుగుల ఆజానుబాహు రూపంలో నిల్చుని వల్లీ దేవసేన సమేతంగా దర్శనం ఇవ్వడం చాలా విశేషంగా చెబుతారు. శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ వల్లకోట్టై ఊరు ఉంటుంది. మహిమాన్విత వల్లకోట్టై మురుగన్ ఆలయం తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలకు సమానంగా విరాజిల్లుతోంది. మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm Advertisement* ఈ క్షేత్రంలో స్థల వృక్షం- పాదిరి చెట్టు.  ఒకప్పడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తులు ఇక్కడున్న ఒక పాదిరి చెట్టు క్రిందనే స్వయంవ్యక్తం అయినట్లుగా తెలుస్తో...