శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుడికి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఎక్కడుంది? ఆ ఋణపత్రానికి సాక్షులెవరు?
తిరుమలలో శ్రీవారి పుష్కరిణి ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే !! శ్రీవారి కోనేటి గట్టుమీద నైరుతి దిశలో శంకరాచార్యులవారి సన్నిధి ప్రక్కన ఒక అశ్వత్ద వృక్షం, అంటే రావి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు మీకు చెబుతాను. శ్రీనివాసుడు తన పెళ్లి ఖర్చుల కోసం కలియుగ ధర్మాన్ని అనుసరించి అలకాపురి అధినేత అయిన కుబేరుడి వద్ద రామముద్ర కలిగిన పధ్నాలుగు లక్షల వరహాలు అప్పు చేస్తాడు. ఆ పధ్నాలుగు లక్షల ఋణానికి సంబంధించిన చర్చలు, చెల్లింపులు అన్నీ కోనేటి గట్టునున్న ఈ రావిచెట్టు క్రిందనే బ్రహ్మ, మహేశ్వరుల సమక్షంలో జరుగుతాయి. ఆ క్రమంలో సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారే స్వయంగా ఒక ఋణపత్రం తయారుచేయగా దానికి బ్రహ్మ, మహేశ్వరులు ఇద్దరూ సాక్షులుగా వ్యవహరించారు. మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* అయితే ముచ్చటగా మూడవ సాక్షి కూడా కావాలి అని కుబేరుడు పట్టుబట్టడంతో, అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో, ఈ రావిచెట్టును సహాయం అడిగి ఋణపత్రంలో మూడవ సాక్ష...