మహా కుంభమేళా 2025: ప్రయాగరాజ్ లో ఒక రోజు ట్రిప్ ...
ఒకప్పుడు అలహాబాద్ లేదా ఇలాహాబాద్ గా పిలవబడిన ప్రయాగరాజ్ పట్టణంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. పరమ పవిత్రమైన గంగ, యమున మరియు సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్ లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు, అంటే 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనున్నది. సుమారు 40 కోట్ల మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. ప్రయాగరాజ్ లో మొత్తం నాలుగు రైల్వే స్టేషన్లు ఉంటాయి, వాటిలో రెండు ముఖ్యమైనవి. ఒకటి ప్రయాగరాజ్ సంగం స్టేషన్; ఇది త్రివేణి సంగమ ప్రాంతానికి మరియు ఇతర సందర్శన ప్రదేశాలకు దగ్గరగా ఉంటుంది. మరొకటి ప్రయాగరాజ్ జంక్షన్; ఇది సిటీ వైపున ఉంటుంది కాబట్టి చాలా రైళ్లు ఎక్కువగా ఈ స్టేషన్ లోనే ఆగుతాయి. సులువైన ప్రయాణానికి నేస్తం: American Tourister FORNAX - Luggage Soft - TSA Lock, Telescopic Trolly, 8 Wheels, Garment Suiter, Laundry & Shoe Bags Advertisement* సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం మరియ...